ఎంపీ అవినాష్ రెడ్డి ఏమైనా పారిపోతున్నారా: పేర్ని నాని
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి ఓ వర్గం మీడియా ఇష్టానుసారంగా రాస్తోందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుండె జబ్బుతో ఆస్పత్రి పాలైన తన తల్లి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐని విచారణ నుంచి వెసులుబాటు అడిగారన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉంటే అవినాష్ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. పిలిచిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు కదా అని నిలదీశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయారా ఫైరయ్యారు.
telugu videoTimesXP TeluguUpdated: 24 May 2023, 1:46 am